రామాయపట్నం పోర్టులో మొక్కలు నాటిన ఉద్యోగులు, సిబ్బంది
మొక్కలు నాటిన నవయుగ
రామాయపట్నం పోర్టులో మొక్కలు నాటిన ఉద్యోగులు, సిబ్బంది
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్టులో.. నవయుగ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో.. పోర్టు పరిధిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఇంజనీర్లు, ఉద్యోగులు, సిబ్బంది మొక్కలు నాటి.. ప్రతిజ్ణ చేశారు. రామాయపట్నం పోర్ట పరిధిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి.. ఆ మొక్కలను పరిరక్షించేలా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంబీ అధికారులు డీఈ మునివేలు, జీఎం నారాయణరావు, ఏజీఎం వెంకటరావు, ఏఈ గోపి, పోర్ట్ పీఆర్వో కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు