మంత్రి నారాయణ ఈసారి లక్ష మెజార్టీతో గెలుస్తారు
టీడీపీ నగర అధ్యక్షుడు మామిడాల మధు
సైకో పాలన విరగడై ఏడాదైంది..!
మంత్రి నారాయణ ఈసారి లక్ష మెజార్టీతో గెలుస్తారు
- టీడీపీ నగర అధ్యక్షుడు మామిడాల మధు
ప్రజల ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి.. సుపరిపాలన అందించి.. మంత్రి నారాయణ ఆఖండ మెజార్టీతో గెలుపొంది ఏడాది పూర్తి అయిందని, తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగర అధ్యక్షుడు మామిడాల మధు అన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళల ఆధ్వర్యంలో మైపాడు గేటు కేపిఆర్ కన్వెన్షన్ ప్రాంతంలో బాణా సంచ కాల్చి భారీ కేక్ కట్ చేసి మంత్రి నారాయణ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అఖండ మెజార్టీతో గెలుపొంది.. మంత్రి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి నెల్లూరు నగరం అభివృద్ధి.. సంక్షేమంలో ప్రధమ పథంలో దూసుకెళ్తుందన్నారు. మంత్రి.. కార్యకర్తలకు అందిస్తున్న సహాయ సహకారాలు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏ నాయకులు చేయలేరని, వచ్చే ఎన్నికల్లో లక్ష మెజార్టీతో గెలుపొందడం ఖాయం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శైలజ తెలుగుదేశం పార్టీ నేతలు అరవ కుమార్, మిద్దె రవికుమార్, శశి కుమార్, కరిముల్లా, అరుణ్ కుమార్, మొహిద్దిన్, మస్తాన్, హబీబ్, మద్దూరి వెంకటేశ్వర్లు, గంగాధర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.