స‌కాలంలో వ‌ర్షాలు కుర‌వాలి.. సంవృద్ధిగా పంట‌లు పండాలి..!

లేబూరు గ్రామ‌దేవ‌త శ్రీ‌కుంకాల‌మ్మ త‌ల్లి జాత‌ర మ‌హోత్స‌వంలో

అమ్మ‌వారిని కోరుకున్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి

స‌కాలంలో వ‌ర్షాలు కుర‌వాలి..
సంవృద్ధిగా పంట‌లు పండాలి..!
లేబూరు గ్రామ‌దేవ‌త శ్రీ‌కుంకాల‌మ్మ త‌ల్లి జాత‌ర మ‌హోత్స‌వంలో

అమ్మ‌వారిని కోరుకున్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి

నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం లేబూరు గ్రామ దేవత శ్రీ కుంకాలమ్మ తల్లి జాతర మహోత్సవానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి హాజ‌ర‌య్యారు. ఈసంద‌ర్భంగా ఆమె అమ్మ‌వారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారి కృపతో సకాలంలో వర్షాలు కురిసి.. సమృద్ధిగా పాడిపంటలు పండాలని, ప్ర‌జ‌లంద‌రూ సుభిక్షంగా ఉండాల‌ని ఈసంద‌ర్భంగా ఆమె కోరుకున్నారు. అనంత‌రం ఆమె మాట్లాడుతూ.. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి పాలన సాగుతుందని, సంక్షేమం, అభివృద్ధి సమతూకంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. ఎంపీటీసీ మధుసూదన్ రెడ్డి, టిడిపి మండలాధ్యక్షుడు ఏకోలు పవన్ రెడ్డి ఆధ్వర్యంలో ‘సుపరిపాలన మొదలై ఏడాది’ పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *