గత ఎన్నికల్లో 151 సీట్లు ఈవీఎం ద్వారానే వచ్చాయా.. ప్రసన్నకుమార్రెడ్డీ..?
కోవూరు జనసేన పార్టీ నేతలు
వెన్నుపోటు కాదయ్యా.. మీకు గుండెపోటు తెచ్చిన దినం
గత ఎన్నికల్లో 151 సీట్లు ఈవీఎం ద్వారానే వచ్చాయా.. ప్రసన్నకుమార్రెడ్డీ..?
కోవూరు జనసేన పార్టీ నేతలు
కోవూరు మండలం లోని జనసేన పార్టీ కార్యాలయంలో కూటమి నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం నందు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కూటమి నాయకులు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి జగన్మోహన్ రెడ్డి ఓర్వలేక.. వాళ్ల ఉనికిని పూర్తిగా కోల్పోతున్న పరిస్థితుల్లో వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం చేపట్టిందని ఎద్దేవ చేశారు. వెన్నుపోటు దినం కాదయ్యా.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ అరాచక పాలనకు బుద్ధి చెప్పి.. మీకు గుండెపోటు తెచ్చారయ్య అంటూ వారు ఎద్దేవా చేశారు. ఈవీఎం మిషన్ ద్వారా కూటమి ప్రభుత్వం గెలిచారన్న.. ప్రసన్నకుమార్ రెడ్డి.. మీరు గతంలో 151 స్థానాలు ఈవీఎం ద్వారానే గెలిచారా.. మీ వైసీపీ ప్రభుత్వానికి అన్ని సీట్లు ఎలా వస్తాయయ్య అని వారు ప్రశ్నించారు. ఈ సమావేశంలో కూటమి నేతలు జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ సప్పిడి శ్రీనివాసులు రెడ్డి, టిడిపి నేత ఇంతా మల్లారెడ్డి, బిజెపి మండల అధ్యక్షుడు సుబ్బారావు, జనసేన ఐటి కోఆర్డినేటర్ శివకృష్ణ, జనసేన మండలాధ్యక్షుడు అల్తాఫ్, తదితరులు పాల్గొన్నారు.