నేటి వార్త మాలిక‌

క‌ల్తీ లేని వార్త‌లు సంచ‌ల‌నం రేపే క‌థ‌నాలు

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెన్నుపోటు దినాన్ని నిర్వహించారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జిలు, మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీలు చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సౌజన్యంతో ట్రై సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలతో కలసి 100 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో దివ్యాంగుల కష్టాలను చూసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభాకర్ రెడ్డి చెప్పారు.

నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని రాజంపేట, తిరుపతి ఎంపీలు పరామర్శించారు. ప్రభుత్వం చేసే తప్పులను, అరాచకాలను ఎత్తి చూపినందుకే కాకాణిపై అక్రమ కేసులు పెట్టారని వారు వ్యాఖ్యానించారు.

బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. వార్డులో పర్యటిస్తూ ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. స్పాట్ లోనే అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారు.

అధికారులు మారితే చాలు…ఆక్రమించేందుకు రెడీ అయిపోతున్నారు. అదేదో గుట్టో…ఖాళీ స్థలమో కాదు…ఏకంగా అడుగుల మేర నీరు ఉండే చెరువును కబళించి వేస్తున్నారు. పది అడుగుల మేర మట్టి కట్టలు వేసి చెరువునే సాగు భూమిగా మారుస్తున్న ఘనుల భాగోతం ఇది.

కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు అయిన సందర్భంగా కందుకూరులో టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలసి కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీ నాయకులు వెన్నుపోటు దినం నిర్వహించారు. నగరిలో మాజీ మంత్రి రోజా ఆధ్వర్యంలో వినూత్నంగా ఆందోళన చేశారు. రోజాతో సహా అందరూ చెవిలో పువ్వులు పెట్టుకుని క్లాక్ టవర్ సెంటర్ నుంచి మున్సిపల్ ఆఫీసు వరకు ర్యాలీ చేశారు.

ఐసు అడిగితే ఇవ్వలేదని అమ్మే వ్యక్తిపై కొందరు వ్యక్తులు దాడికి తెగపడిన ఘటన గూడూరులో చోటు చేసుకుంది. శ్రీనివాసులు అనే వ్యక్తిపై కొందరు అకారణంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన బాధితుడు శ్రీనివాససులు హాస్పిట్లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రద్దు చేసిన చెక్ పవర్ ను వెంటనే పున:రుద్దరించాలని ముదివర్తి గ్రామ సర్పంచ్ నిర్మల డిమాండ్ చేశారు. నెల్లూరు డీపీవో కార్యాలయం ఎదుట పురుగుల మందుతో ఆమె ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *