నాసిర‌కం పామ్ ఆయిల్ మొక్క‌లిస్తున్నారు..!

తీవ్రంగా న‌ష్ట‌పోతున్నాం_ _అధికారుల నిర్ల‌క్ష్యంవ‌ల్లే దిగుబ‌డిపై ప్ర‌భావం

ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు న‌ష్ట‌ప‌రిహారంపై దృష్టిపెట్టాలి

ఎన్‌-3తో గోడువెళ్ల‌బోసుకున్న ద‌మ్మ‌పేట మండ‌లం.. గురువైగూడెం గిరిజ‌న రైతులు_

నాసిర‌కం పామ్ ఆయిల్ మొక్క‌లిస్తున్నారు..!
తీవ్రంగా న‌ష్ట‌పోతున్నాం
అధికారుల నిర్ల‌క్ష్యంవ‌ల్లే దిగుబ‌డిపై ప్ర‌భావం
ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు న‌ష్ట‌ప‌రిహారంపై దృష్టిపెట్టాలి

ఎన్‌-3తో గోడువెళ్ల‌బోసుకున్న ద‌మ్మ‌పేట మండ‌లం.. గురువైగూడెం గిరిజ‌న రైతులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గురువైగూడెం గ్రామంలో ని ఫామ్ ఆయిల్ రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారు. నాశిరకం ఫామ్ ఆయిల్ మొక్క‌లు ఇవ్వ‌డం.. స‌రైన దిగుబ‌డి రాక‌పోవ‌డం.. గిట్టుబాటు ధ‌ర ద‌క్క‌క పోవండంతో రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. సుమారు 150 మంది రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ రైతులు వాపోతున్నారు. ఈ సంద‌ర్భంగా గిరిజ‌న రైతులు ఎన్‌-3తో ప్ర‌త్యేకంగా మాట్లాడారు. త‌మ‌కు పెట్టుబడి మాత్రం భారీగా అవుతుందని.. పంట దిగుబడి వచ్చి.. ఆదాయం చేకూరట్లేదని అంటున్నారు. వెంటనే ప్రజా ప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం చేయకుండా నష్ట పరిహారం అందించాలని స్థానిక గిరిజన రైతులు కోరుకుంటున్నారు. మొత్తం సన్న, చిన్న కారు రైతులను మోసం చేయడం ఆయిల్ ఫామ్ యాజమాన్యానికి స‌మంజ‌సం కాద‌ని.. తక్షణమే నిర్లక్ష్యం వీడాలని, సరైన పద్ధతిలో పరీక్షలు చేసి పామ్ ఆయిల్ మొక్కలు ఇవ్వాలని.. ముందుగా ఇచ్చిన మగ మొక్కలకు నష్ట పరిహారం చెల్లించాలని వారు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *