వివరాలు వెల్లడించిన అంతర్జాతీయ షిరిడి సాయి సేవా భక్త సమ్మేళనం ట్రస్ట్ చైర్మన్
జూన్ 6,7,8 తేదీల్లో షిరిడి సాయి భక్త సమ్మేళనం
- వివరాలు వెల్లడించిన అంతర్జాతీయ షిరిడి సాయి సేవా భక్త సమ్మేళనం ట్రస్ట్ చైర్మన్
తిరుపతి జిల్లా వాకాడు గ్రామంలో జూన్ 6,7,8 తేదీలలో షిరిడి సాయి భక్త సమ్మేళనం ఘనంగా నిర్వహిస్తున్నామని అంతర్జాతీయ షిరిడి సాయి సేవా భక్త సమ్మేళనం ట్రస్ట్ చైర్మన్ సాముద్రికం లక్ష్మీనరసింహారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వాకాడులోని సాయిబాబా ఆలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రతీ ఒక్కరూ పాల్గొని సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో వైస్ ప్రెసిడెంట్ లక్ష్మి, తిరుపతి జిల్లా సాయిబాబా దేవాలయ కన్వీనర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.