జనసేన పార్టీ నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్బాబు
నెల్లూరు నగర జనసేన పార్టీ కార్యాలయంలో జనసైనికుల సంబరాలు
జగన్ పీడ విరగడై ఏడాది
జనసేన పార్టీ నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్బాబు
నెల్లూరు నగర జనసేన పార్టీ కార్యాలయంలో జనసైనికుల సంబరాలు
కూటమి ప్రభుత్వ సుపరిపాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా జనసేన నెల్లూరు జనసేన నగర అధ్యక్షుడు సుజయ్ బాబు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. జనసేన నేతలు, కార్యకర్తలు ఈ సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం బాణాసంచా కాల్చి ఈ రాష్ట్రానికి పట్టిన గ్రహణం వీడి ఏడాది పూర్తి అయిందని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో “సుపరిపాలన ప్రారంభమైంది – రాక్షసి పాలన ముగిసింది” అనే నినాదంతో ప్రజలు విజయోత్సవంగా ఈ రోజును జరుపుకున్నారు. ముగ్గుల పోటీలు, బాణాసంచా కాల్పుల కార్యక్రముల నిర్వహించారు. ఈసందర్భంగా సుజయ్బాబు మాట్లాడారు. జగన్ పీడ విరగడై ఏడాదైందంటూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రజల ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం ప్రారంభించిన సుపరిపాలన ప్రజల జీవితాల్లో నిజమైన మార్పుకు నాంది కానుందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా రిజినల్ కో ఆర్డినేటర్ కోల విజయలక్ష్మి, నగర ప్రధాన కార్యదర్శి శనివారపు అజయ్ బాబు , నగర డివిజన్ ఇంచార్జులు షేక్ సాయి బాబా , చిత్తూరు రాము , శ్రీమంతుల కిషోర్ , కనగలూరు సురేష్, పెడాడ ఆనందరావు , శ్రీనివాసులు నాయుడు , పవన్ కుమార్ రెడ్డి , వవ్విల బాలాజీ , ఊటుకూరు శ్యామ్ , భార్గవ్ రాముడు , నితీష్, నగర కార్యదర్శి ఆముదాల సుమంత్ , వీరమహిళలు రేవతి , హైమ , మల్లిక , నగర సంయుక్త కార్యదర్శి తెల్లం బాలు నాయకులు ఘని, దీపక్ , మణి కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు