ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదైన సందర్భంగా సంగంలో సంబరాలు
వీరమహిళలకు ముగ్గుల పోటీలు
చెడుపై మంచి గెలిచిన రోజు….
- ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదైన సందర్భంగా సంగంలో సంబరాలు
- వీరమహిళలకు ముగ్గుల పోటీలు
రాష్ట్రంలో చెడుపై మంచి గెలిచి సుపరిపాలన మొదలై ఏడాదైనా సందర్భంగా సంగం తూర్పు వీధిలో జనసేన నాయకులు వీర మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ పాల్గొని ముగ్గుల పోటీలను పరిశీలించారు. అనంతరం ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వీర మహిళలకు నగదు, బహుమతులు ప్రధానం చేశారు. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ రాక్షస పాలన అంతమై నేటికి ఏడాదైన సందర్భంగా డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో జనసేన పార్టీ ఎన్నో కేసులు, అరెస్టులు ,నిర్బంధాలకు గురైందని మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తోట భాస్కర్, దినేష్ రాయల్, అనిల్ రాయల్, గుమ్మలపాటి మదన్ తదితరులు పాల్గొన్నారు.