కరపత్రాన్ని ఆవిష్కరించిన సీపీఎం నేతలు_
కూటమి ప్రభుత్వ ప్రధమ వార్షికోత్సవ కానుక
- కరపత్రాన్ని ఆవిష్కరించిన సీపీఎం నేతలు
కూటమి ప్రభుత్వ ప్రధమ వార్షికోత్సవ కానుకగా పట్టణ ప్రజలపై అదనపు భారాలు మోపుతోందని సీపీఎం నేత మాదాల వెంకటేశ్వర్లు ఆరోపించారు. నెల్లూరులోని సీపీఎం కార్యాలయంలో “స్మార్ట్ మీటర్లు వద్దు” “కరెంట్ చార్జీలు తగ్గించాలని” అంటూ కర పత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించి ప్రీపెయిడ్, పీక్ అవర్స్ లో అదనపు చార్జీల పేరుతో భారాలు మోపుతుందన్నారు. ఈ విధంగా భారాలు మోపడాన్ని వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ చేసి నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రజలంతా ఐక్యంగా ఉద్యమం సాగించాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో సీపీఎం నాయకులు పాల్గొన్నారు.