కూటమి పాలనపై మధుసూదన్ యాదవ్ ఫైర్ – కందుకూరులో వెన్నుపోటు దినం
అబద్ధపు హామీలతో పబ్బం
- కూటమి పాలనపై మధుసూదన్ యాదవ్ ఫైర్
- కందుకూరులో వెన్నుపోటు దినం
ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నమ్మించి నట్టేట ముంచారని హామీలను అమలు చేయకుండా అబద్ధాలతో పబ్బం గడుపుతున్నారని కందుకూరు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి బుర్ర మధుసూదన్ యాదవ్ ఆరోపించారు. నెల్లూరు జిల్లా కందుకూరులో వెన్నుపోటు దినం కార్యక్రమం జరిగింది. స్థానిక అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు కార్యకర్తలతో కలిసి నిరసన ర్యాలీ చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన ద్రోహాన్ని నిరసిస్తూ వెన్నుపోటు దినం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకు, కార్యకర్తలు పాల్గొన్నారు.