మాజీ ఎమ్మెల్యే సొంతగడ్డనే దోచుకున్నాడు

అమృత్ పథకం పైప్ లైన్ నిర్మాణంలో రూ.13 కోట్ల రూపాయల అవినీతి – రూ.7.40 కోట్ల విలువ చేసే పైపులైను ధ్వంసం చేస్తే కమీషన్ కు కాంట్రాక్టర్ తో కుమ్మకు – మున్సిపల్ ఎన్నికలు లేకుండా చేసి విడుదలయ్యే రూ.కోట్ల ఆర్థిక సంఘం నిధులకు గండి – అమృత్ పథకంలో అవినీతి అంతింతకాదయా అక్రమాలను ఆధారాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి.

మాజీ ఎమ్మెల్యే సొంతగడ్డనే దోచుకున్నాడు…

  • అమృత్ పథకం పైప్ లైన్ నిర్మాణంలో రూ.13 కోట్ల రూపాయల అవినీతి
  • రూ.7.40 కోట్ల విలువ చేసే పైపులైను ధ్వంసం చేస్తే కమీషన్ కు కాంట్రాక్టర్ తో కుమ్మకు
  • మున్సిపల్ ఎన్నికలు లేకుండా చేసి విడుదలయ్యే రూ.కోట్ల ఆర్థిక సంఘం నిధులకు గండి
  • అమృత్ పథకంలో అవినీతి అంతింతకాదయా
  • అక్రమాలను ఆధారాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి.


తన ఏడాది పాలన పురోగతి, గత వైసిపి ఐదేళ్ల విధ్వంసంపై కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.


కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తన సొంతగడ్డ కావలిని అడ్డంగా దోచుకున్నాడని, కమీషన్లకు ఆశపడి కాంట్రాక్టర్లు, అధికారులతో కుమ్మక్కయ్యాడని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కావలి ఎమ్మెల్యే తన ఏడాది పాలన పురోగతి, గత వైసిపి ఐదేళ్ల విధ్వంసంపై మంగళవారం కావలి పట్టణం దొడ్ల మనోహర్ రెడ్డి కళ్యాణ మండపంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా ఆయన అవినీతి, కమీషన్ల కక్కుర్తి, నిర్లక్ష్యం వల్ల ఒక్క తాగునీటి పథకంలోనే రూ.27 కోట్లమేర అక్రమాలు జరిగాయని కుండబద్దలుకొట్టారు. అమృత్ తాగునీటి పథకంలో అక్రమాలు, పైలాన్ ధ్వంసానికి కారణాలు, మున్సిపల్ ఎన్నికలు జరపక పోవడానికి కారణాలు, పర్యవసానంగా కావలి మున్సిపాలిటీకి జరిగిన నష్టం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి విశదీకరించారు. అదేవిధంగా ఉదయగిరి రోడ్డులో జాతీయ రహదారి నిర్మాణానికి మున్సిపాలిటీ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి వచ్చే 7.40 కోట్ల రూపాయల విలువ చేసే పైప్ లైన్ ధ్వంసం చేశారని, ఈ నిధులు మున్సిపాలిటీకి కట్టించకుండా కమీషన్ల కోసం కాంట్రాక్టర్లతో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కుమ్మక్కు అయ్యాడన్నారు. టిడ్కో నివాసాలకు జమ్మలపాలెం వద్ద 13 కోట్ల సేకరించిన భూమిని అప్పణంగా నుడాకు అప్పజెప్పారని, అక్కడ ప్లాట్లు చేసి నుడా అమ్ముకుంటే 45 కోట్ల రూపాయలు వారికి వచ్చాయన్నారు. అప్పటి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల కావలి మున్సిపాలిటీకి నుడా నుంచి రూపాయి కూడా మున్సిపాలిటీకి రాలేదన్నారు. అమృత్ పథకం అమలుకు కావలి మున్సిపాలిటీ 52 కోట్ల రూపాయలు అప్పుతెచ్చిందని, ఇప్పటికి అసలు కట్టకపోగా వడ్డీలు చెల్లిస్తున్నట్లు చెప్పారు. అమృత్ పథకం 2022 కి పూర్తయ్యి ఉంటే తాగునీటి పన్నుల ద్వారానే 4.51 కోట్ల రూపాయలు పన్నులు వచ్చేవి అన్నారు. కానీ ఒక్క కొళాయి బిగించలేదన్నారు. మున్సిపల్ కౌన్సిల్ ఉంటే ఇవన్నీ తెలుస్తాయని, కుట్రపూరితంగా మున్సిపల్ ఎన్నికలు జరగాకుండా ప్రతాప్ కుమార్ రెడ్డి అడ్డుకున్నాడన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *