నేటి వార్త మాలిక‌

క‌ల్తీ లేని వార్త‌లు సంచ‌ల‌నం రేపే క‌థ‌నాలు

తన ఏడాది పాలన పురోగతి, గత వైసిపి ఐదేళ్ల విధ్వంసంపై కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు

యోగా మానిసక, ఆధ్యాత్మిక, ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తెలిపారు. ఇందుకూరుపేట మండలం మైపాడు సముద్ర తీరాన జరిగిన యోగాంధ్రను ఆమె ఇన్చార్జి కలెక్టర్ కార్తీక్, ఆర్డీవో అనూషలతో ప్రారంభించారు.

నెల్లూరులో డీఆర్ఐ అధికారులు రెండో రోజు కూడా దాడులు నిర్వహించారు. నేషనల్ జ్యూవెలరీస్ యజమానిని అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. అధికారు ఆకస్మిక దాడులతో బంగారు వ్యాపారుల్లో ఒక్క సారిగా గుబులు పట్టుకుంది. దాడులు విష‌యం తెలుసుకున్న అక్రమ వ్యాపారాలు చేసే గోల్డ్ వ్యాపారులంతా షాపులు మూసేసి.. ప‌రార్ అయ్యారు.

IIT JEE అడ్వాన్డ్స్-2025 ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని విద్యా సంస్థల డీన్ రాయుడు పేర్కొన్నారు. రామలింగాపురంలోని నారాయణ కాలేజీలో అభినందన సభ ఏర్పాటు చేసి ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్ని అభినందించారు.

రైతులకు నష్టపరిహారం చెల్లించి జాతీయ రహదారులు నిర్మించాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. నగరంలోని సీపీఎం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.

IIT JEE అడ్వాన్డ్స్-2025 ఫలితాల్లో డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజీ విద్యార్థులు ప్రభంజనం సృష్టించార‌ని ఆ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ రామ్మూర్తి నాయుడు తెలిపారు. మాగుంట లేఅవుట్లోని డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజీలో అభినందన సభ ఏర్పాటు చేసి ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్ని అభినందించారు.

వైసీపీ వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. కావలిలోని తన నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.

కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రశాంతి ప్రశాంతంగా అందర్నీ చూసుకుంటుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. వైసీపీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు వేమిరెడ్డి దంపతులు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

IIT JEE అడ్వాన్డ్స్-2025 ఫలితాల్లో ఓవెల్ జూనియర్ కాలేజీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. మాగుంట లేఅవుట్లోని ఓవెల్ కాలేజీలో అభినందన సభ ఏర్పాటు చేసి ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్ని విద్యా సంస్థల చైర్మన్ రంగిశెట్టి వేణు అభినందించారు.

కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల హామీలను వెంటనే అమలు చేయాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా కందుకూరులోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

ఓజిలి మండలం రాచపాళెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకావడంతో టెంపో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

నెల్లూరు జిల్లా కలిగిరి మండలం భట్టువారిపాళెంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సిబ్బంది వేధింపులు తట్టుకోలేక కొమర రత్తయ్య అనే వ్యక్తి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *