గ్రామస్థుల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే జారే
దమ్మపేటలో రెవెన్యూ సదస్సు
- గ్రామస్థుల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే జారే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం రాచూరుపల్లి పంచాయతీ కార్యాలయంలో అధికారులు రెవెన్యూ సదస్సుని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో కలసి భూ భారతి చట్టం దరఖాస్తులు స్వీకరించారు. ప్రస్తుత సమాజంలో భూభారత చట్టం అనేది తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని లక్ష్యంతో పునరావృతం చేస్తున్నామన్నారు. సానుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పాటు చేయడం కోసమే భూ భారత చట్టమని ఆయన తెలిపారు. రెవెన్యూ అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సదస్సులో స్థానిక నాయకులు, మహిళా నాయకురాళ్లు, రెవెన్యూ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.