జనరల్ కేటగిరిలో ఐఐటీ సీట్ కైవసం చేసుకున్న విద్యార్థులు
విద్యార్థుల్ని అభినందించిన రత్నం యాజమాన్యం
IIT JEE అడ్వాన్డ్స్-2025 ఫలితాల్లో
డాక్టర్ కిషోర్స్ రత్నం ప్రభంజనం
- జనరల్ కేటగిరిలో ఐఐటీ సీట్ కైవసం చేసుకున్న విద్యార్థులు
- విద్యార్థుల్ని అభినందించిన రత్నం యాజమాన్యం
IIT JEE అడ్వాన్డ్స్-2025 ఫలితాల్లో డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజీ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని ఆ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ రామ్మూర్తి నాయుడు తెలిపారు. నెల్లూరు మాగుంట లేఅవుట్లోని డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజీలో అభినందన సభ ఏర్పాటు చేసి ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్ని అభినందించారు.
బుధవారం విడుదలైన జేఈఈ అడ్వాన్స్ 2025 ఫలితాల్లో డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజీ విద్యార్థులు సత్తా చాటారు. జనరల్ కేటగిరిలో విద్యార్థులు ఐఐటీ సీట్ ని కైవసం చేసుకున్నారు. నెల్లూరు మాగుంట లేఅవుట్ లోని రత్నం జూనియర్ కాలేజీలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్ని విద్యా సంస్థల డైరెక్టర్లు క్రిష్టకిషోర్, వాసంతి కిషోర్ , రోషిణి, ఈశ్వర్, అధ్యాపకులు అభినందించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల జనరల్ మేనేజర్ రామ్మూర్తి నాయుడు మీడియాతో మాట్లాడుతూ… ఇంతటి ఘన విజయానికి విద్యా సంస్థల ప్రత్యేక పర్యవేక్షణ, కాలేజీ అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రుల కృషి కారణమని తెలిపారు. పోటీ పరీక్షల్లో తమ విద్యార్థులకు ఎవరూ సాటి రారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మనోజ్ కుమార్, అకడమిక్ అడ్వైజర్ నరసయ్య నాయుడు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.