హామీల అమలులో కూటమి విఫలం

సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు చిన్నం పెంచలయ్య

సూళ్లూరుపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట సీపీఐ ధర్నా

హామీల అమలులో కూటమి విఫలం…

  • సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు చిన్నం పెంచలయ్య
  • సూళ్లూరుపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట సీపీఐ ధర్నా


మేనిఫెస్టోలో ప్రజలకి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి విఫలమైందని సీపీఐ నేతలు మండిపడ్డారు. వెంటనే హామీలన్నింటిని నెరవేర్చాలంటూ సూళ్లూరుపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను పూర్తి చేయడంలో పూర్తిగా విఫలమైందని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు చిన్నం పెంచలయ్య అభిప్రాయపడ్డారు. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో రాష్ట్రంలో అప్రజాస్వామ్య పాలన కొనసాగుతుందని… ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నారని ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను భారత కమ్యూనిస్టు పార్టీ చూస్తూ ఊరుకోదని ప్రజా ఉద్యమాల ద్వారా ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు. వెంటనే ప్రజలకి ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి సి సుధాకర్ రెడ్డి, సిపిఐ నాయకులు నాగేంద్ర, మోదుగుల పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *