ప్రశాంతి ప్రశాంతంగా చూసుకుంటుంది

ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

టీడీపీ తీర్ధం పుచ్చుకున్న కమ్మపాళెం వైసీపీ నాయకులు, కార్యకర్తలు

టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన వేమిరెడ్డి దంపతులు

ప్రశాంతి ప్రశాంతంగా చూసుకుంటుంది..

  • ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
  • టీడీపీ తీర్ధం పుచ్చుకున్న కమ్మపాళెం వైసీపీ నాయకులు, కార్యకర్తలు
  • టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన వేమిరెడ్డి దంపతులు


కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రశాంతి ప్రశాంతంగా అందర్నీ చూసుకుంటుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు వేమిరెడ్డి దంపతులు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.


బెల్లం వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో 1500కు పైగా వైసిపి నాయకులు వేమిరెడ్డి దంపతుల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కొడవలూరు మండలం కమ్మపాళెం చేరుకున్న వేమిరెడ్డి దంపతులను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అఖండ స్వాగతం పలికారు. ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మంచోళ్ళు వైసిపిలో వుండలేరన్నారు. దైవ నిర్ణయం మేరకే తాను తెలుగుదేశం పార్టీలో చేరానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆయన అభివృద్ధికి మారు పేరుగా అభివర్ణించారు. అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు సంక్షేమ విధానాలకు ఆకర్షితులై వైసిపి వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరిన నాయకులకు ధన్యవాదాలు తెలియచేసారు. ప్రజలు ప్రభుత్వానికి మధ్య నాయకులు వారధిగా వుంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నాపా వెంకటేశ్వర్లు నాయుడు, జీవీన్ శేఖర్ రెడ్డి,మండల ఇంచార్జ్ అడపాల శ్రీహరి రెడ్డి, బెజవాడ వంశీకృష్ణారెడ్డి, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి,పూండ్ల అచ్యుత్ రెడ్డి, కరకటి మళ్లీ, మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, కోటంరెడ్డి అమరేందర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *