పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలి

సీపీఐ నేతలు డిమాండ్_ _కందుకూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ నిరసన

పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

  • సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలి
  • సీపీఐ నేతలు డిమాండ్
  • కందుకూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ నిరసన


కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల హామీలను వెంటనే అమలు చేయాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా కందుకూరులోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.


పేదలకు పట్టణాలలో రెండు సెంట్లు, గ్రామాలలో మూడు సెంట్లు స్థలాన్ని కేటాయించి ఇళ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని సీపీఐ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయం నుండి మండల తహశిల్దార్ కార్యాలయం వరకు సిపిఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం తహశిల్దార్ లావణ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సంధర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బి.సురేష్ బాబు మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి బాలకోటయ్య, ఎఐటియుసి నియోజక వర్గ అధ్యక్షుడు మురళి, కార్యదర్శి ఆనందం మోహన్, నాయకులు ఉప్పుటూరి మాధవరావు చేవూరి దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *