భారీగా అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు ఆరోపణలు
కర్నాటకకు చెందిన డీఆర్ఐ అధికారుల ఆకస్మిక దాడులు
పలు రికార్డులు, హార్డ్ డిస్క్లు స్వాదీనం
యజమాని భావిష్ జైను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అధికారులు
ఆందోళనలో నెల్లూరు బంగారు వ్యాపారులు
నేషనల్ జ్యూవెలరీస్ అక్రమాలు..?!
భారీగా అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు ఆరోపణలు
కర్నాటకకు చెందిన డీఆర్ఐ అధికారుల ఆకస్మిక దాడులు
పలు రికార్డులు, హార్డ్ డిస్క్లు స్వాదీనం
-యజమాని భావిష్ జైను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అధికారులు-ఆందోళనలో నెల్లూరు బంగారు వ్యాపారులు
నెల్లూరు నగరంలోని మండపాల వీధిలో బెంగళూరుకు చెందిన డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ – డీ ఆర్ ఐ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నేషనల్ జ్యూవెలరీ గోల్డ్ షాప్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని.. జీరో వ్యాపారం చేస్తున్నారని.. అక్రమంగా బంగారు ఎగుమతులు, దిగుమతులు చేసుకుంటూ.. కోట్లాది రూపాయిలు లావాదేవీలు చేస్తున్నారంటూ.. సోదాలు నిర్వహించారు. ఈ సోదాలతో మండపాల వీధితోపాటు చిన్నబజారు, పెద్ద బజారు, కొరడావీధి తదితర ప్రాంతాల్లోని బంగారు వ్యాపారులంతా ఆందోళన చెందారు. హుటా హుటీన షాపులు కట్టేసి.. నేషనల్ జ్యూవెలరీస్ వద్ద ఏం జరుగుతుందోనని ఆతృతతో ఎదరుచూస్తున్నారు. ఈ అక్రమ వ్యాపారం నేషనల్ జ్యూవెలరీస్ అధినేత భావిష్ జైన్ చేస్తున్నారంటూ కర్నాటకకు చెందిన డీ ఆర్ ఐ అధికారులు ఆరోపిస్తున్నారు. అయితే.. స్థానిక పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం.. వారిని వెంట తీసుకురాకపోవడంతో డీఆర్ఐ అధికారులతో నేషనల్ జ్యూవెలరీస్ వ్యాపారులు, సిబ్బంది.. మరి కొంత మంది బంగడారు వ్యాపారులు ఎదురుతిరిగారు.. ప్రశ్నించారు.. వాగ్వాదానికి దిగారు. అయినా.. వారెవరి మాటా లెక్కచేయని అధికారులు ఆ గోల్డ్ షాప్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. బంగారు కొనుగోలు.. అమ్మకాలు, ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన పలు రికార్డులు, హార్డ్ డిస్క్లు, బిల్లులను స్వాదీనం చేసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి నేషనల్ జ్యూవెలరీస్ అధినేత భావిష్ జైన్ను చిల్డ్రన్స్పార్కు సమీపంలోని డీఆర్ఐ కార్యాలయంకు తరలించి.. అక్కడ విచారిస్తున్నారు. దీనిపై నెల్లూరులోని బంగారు వ్యాపారుల్లో గుబులు పట్టుకుంది