ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు స్వీకరించిన ఎస్పీ కృష్ణ కాంత్
చట్ట ప్రకారం విచారణ జరిని న్యాయం చేస్తాం
- ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు స్వీకరించిన ఎస్పీ కృష్ణ కాంత్
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ తెలిపారు. నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఆయన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు.
నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఎస్పీ కృష్ణకాంత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసు అధికారులతో కలసి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలు రిపీట్ కాకుండా చూడాలని..వచ్చిన అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అధికారులకి ఎస్పీ సూచించారు. వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ తెలియజేశారు.