కార్పొరేషన్ గ్రీవెన్స్ కి 52 ఫిర్యాదులు

_నిర్దేశించిన సమయంలోపు పరిష్కారాలు అందించండి

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు స్వీకరించిన కమిషనర్ వై.ఓ నందన్_

కార్పొరేషన్ గ్రీవెన్స్ కి 52 ఫిర్యాదులు…

  • నిర్దేశించిన సమయంలోపు పరిష్కారాలు అందించండి
  • ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు స్వీకరించిన కమిషనర్ వై.ఓ నందన్


నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను కమిషనర్ నందన్ నిర్వహించారు. అర్జీదారుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. నిర్దేశించిన సమయంలోపు పరిష్కారాలు అందించాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు.


ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందుకున్న ఫిర్యాదులకు నిర్దేశించిన సమయంలోపు పరిష్కారాలను అందించాలని కమిషనర్ వై.ఓ నందన్ అన్ని విభాగాల అధికారులకు సూచించారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను కమిషనర్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లనుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందుకున్న స్థానిక సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలానికి సంబంధించి అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని, వర్షపు నీరు డ్రైన్ కాలువల ద్వారా సాఫీగా ప్రవహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని కమిషనర్ స్పష్టం చేశారు. వేదికలో మొత్తం – 52 ఫిర్యాదులను అందుకున్నామని ఆయన చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *