కలెక్టరేట్ గ్రీవెన్స్ లో అర్జీలు స్వీకరించిన ఇన్చార్జి కలెక్టర్

కలెక్టరేట్ గ్రీవెన్స్ లో అర్జీలు స్వీకరించిన ఇన్చార్జి కలెక్టర్_

కలెక్టరేట్ గ్రీవెన్స్ లో అర్జీలు స్వీకరించిన ఇన్చార్జి కలెక్టర్

  • అనేక సమస్యలపై వినతులు అందచేసిన బాధితులు


ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రతీ అర్జీని క్షుణంగా పరిశీలించి బాధితులకి న్యాయం జరిగేలా చూడాలని ఇన్చార్జి కలెక్టర్ కే కార్తీక్ అధికారుల్ని ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన వినతులు స్వీకరించారు.


నెల్లూరు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం ఇన్చార్జి కలెక్టర్ కే కార్తీక్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల నుంచి ఇన్చార్జి కలెక్టర్ వినతులు స్వీకరించారు. వేదికకు వచ్చే ప్రతీ అర్జీని క్షుణంగా పరిశీలించి బాధితులకి సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. అర్జీలు రిపీట్ కాకుండా చూడాలని అధికారులకి సూచించారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ ఉదయభాస్కర్, డి ఆర్ డి ఎ పిడి నాగరాజ కుమారి, డ్వామా పిడి గంగా భవాని ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *