రేపు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఏడాది తన ప్రగతి నివేదిక వెల్లడి
కావలిలోని ప్రజాధనం దోపిడీపై బయటపెట్టనున్న సంచలనాలు
కావలి ప్రజలకు, జిల్లా జర్నలిస్టులకు, మేధావులకు, ప్రజా సంఘాలకు పిలుపు
వేదిక కానున్న కావలిలోని దొడ్ల మనోహర్ రెడ్డి కళ్యాణ మండపం
అందరి చూపు కావలి ఎమ్మెల్యే వైపే…
- రేపు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఏడాది తన ప్రగతి నివేదిక వెల్లడి
- కావలిలోని ప్రజాధనం దోపిడీపై బయటపెట్టనున్న సంచలనాలు
- కావలి ప్రజలకు, జిల్లా జర్నలిస్టులకు, మేధావులకు, ప్రజా సంఘాలకు పిలుపు
- వేదిక కానున్న కావలిలోని దొడ్ల మనోహర్ రెడ్డి కళ్యాణ మండపం
కావలి పట్టణంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మరో సంచలనానికి తెరదీయబోతున్నారు. కావలి చరిత్రలో అధిక మెజారిటీతో విజయం సాధించి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా తాను సాధించిన ప్రగతిని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన కృషిని ప్రజల ముందు నివేదించనున్నారు. అదేవిధంగా గత వైసిపి పాలనలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సారథ్యంలో చేసిన అవినీతి, అక్రమాలు, దోపిడీ, దౌర్జన్యాలను బయట పెడతానని ప్రకటించారు. ఈ రెండు విషయాలు కావలి ప్రజలు, జర్నలిస్టులు, మేధావులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు తెలుసుకోవాలని ఎమ్మెల్యే కోరుతున్నారు. ఇందుకోసం అందరిని ఆహ్వానిస్తున్నాడు. దీంతో అందరిచూపు మంగళవారం కావలిలోని దొడ్ల మనోహర్ రెడ్డి కళ్యాణ మండలంలో ఎమ్మెల్యే ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పై ఆశక్తి నెలకొని ఉంది.