రాష్ట్రంలో పట్టాలెక్కిన అభివృద్ధి
P-4 అనేది ఒక విప్లవాత్మక కార్యక్రమం
రాష్ట్ర గృహనిర్మాణ, ఐ అండ్ పిఆర్ మంత్రి కొలుసు పార్థసారథి
యాదవ విద్యార్థుల ప్రతిభా పురస్కారాలు పంపిణీ చేసిన మంత్రి
సీఎం సరికొత్త ఆలోచనలు…
- రాష్ట్రంలో పట్టాలెక్కిన అభివృద్ధి
- P-4 అనేది ఒక విప్లవాత్మక కార్యక్రమం
- రాష్ట్ర గృహనిర్మాణ, ఐ అండ్ పిఆర్ మంత్రి కొలుసు పార్థసారథి
- యాదవ విద్యార్థుల ప్రతిభా పురస్కారాలు పంపిణీ చేసిన మంత్రి
నెల్లూరులో జరిగిన యాదవ విద్యార్థుల ప్రతిభా పురస్కారాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి కొలుసు పార్ధసారధి ముఖ్య అతిధిగా విచ్చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబుునాయుడు సరికొత్త ఆలోచనలతో రాష్ట్రంలో అభివృద్ధి పట్టాలెక్కిందన్నారు.
విజన్ 2047 లక్ష్యంగా రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అగ్రపథంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సరికొత్త ఆలోచనలతో ముందుకుసాగుతున్నారని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. యాదవ విద్యార్థుల ప్రతిభా పురస్కారాల పంపిణీ కార్యక్రమానికి నెల్లూరుకు విచ్చేసిన మంత్రి పార్థసారధి పాత్రికేయులతో మాట్లాడారు.
అన్నిరకాలుగా విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో పయనింపచేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అహర్నిశలు శ్రమిస్తూ సరికొత్త విధానాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతిపక్షాలు కూడా తాము చేసిన తప్పులను సరిదిద్దుకుని రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు.