రేషన్ షాపుల ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ పునఃప్రారంభం..

వృద్ధులకు స్వయంగా రేషన్ సరుకులు పంపిణీ చేసిన సూళ్లూరుపేట తహసిల్దార్ యస్ వి నరసింహారావు కొన్నిచోట్ల టెక్నికల్ ప్రాబ్లంతో ఆగిన రేషన్ సరుకుల పంపిణీ

రేషన్ షాపుల ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ పునఃప్రారంభం..

  • వృద్ధులకు స్వయంగా రేషన్ సరుకులు పంపిణీ చేసిన సూళ్లూరుపేట తహసిల్దార్ యస్ వి నరసింహారావు
  • కొన్నిచోట్ల టెక్నికల్ ప్రాబ్లంతో ఆగిన రేషన్ సరుకుల పంపిణీ


సూళ్లూరుపేటలో రేషన్ షాపుల ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమం పున: ప్రారంభమైంది. తహసీల్దార్ నరసింహారావు లబ్ధిదారులకి సరుకులు పంపిణీ చేశారు. ఈ పాస్ మిషన్ పనితీరుని ఆయన పరిశీలించారు.


కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 1 నుంచి రేషన్ షాపుల వద్ద డీలర్ల ద్వారా అవినీతికి తావు లేకుండా సరుకులు పంపిణీ చేస్తున్నట్లు సూళ్లూరుపేట తహసిల్దార్ నరసింహారావు తెలిపారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని ఇందిరా నగర్ షాప్ నెంబర్ 40 లో రేషన్ ఈ-పాస్ మిషన్ పనితీరును తహసిల్దార్ పరిశీలించారు. దగ్గరుండి లబ్ధిదారులకు సరుకులను పంపిణీ చేశారు. అయితే పలుచోట్ల టెక్నికల్ ప్రాబ్లం తో రేషన్ సరుకులు పంపిణీ ప్రక్రియ ఆగింది. సర్వర్ ప్రాబ్లం పరిష్కారం కాగానే సాయంత్రం నుంచి పంపిణీ చేస్తామని డీలర్లు తెలిపారు. ఈ సందర్భంగా తహసిల్దార్ నరసింహారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆకుతోట రమేష్, టిడిపి నేతలు EV.సురేష్, దంతాల రవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *