వృద్ధులకు స్వయంగా రేషన్ సరుకులు పంపిణీ చేసిన సూళ్లూరుపేట తహసిల్దార్ యస్ వి నరసింహారావు కొన్నిచోట్ల టెక్నికల్ ప్రాబ్లంతో ఆగిన రేషన్ సరుకుల పంపిణీ
రేషన్ షాపుల ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ పునఃప్రారంభం..
- వృద్ధులకు స్వయంగా రేషన్ సరుకులు పంపిణీ చేసిన సూళ్లూరుపేట తహసిల్దార్ యస్ వి నరసింహారావు
- కొన్నిచోట్ల టెక్నికల్ ప్రాబ్లంతో ఆగిన రేషన్ సరుకుల పంపిణీ
సూళ్లూరుపేటలో రేషన్ షాపుల ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమం పున: ప్రారంభమైంది. తహసీల్దార్ నరసింహారావు లబ్ధిదారులకి సరుకులు పంపిణీ చేశారు. ఈ పాస్ మిషన్ పనితీరుని ఆయన పరిశీలించారు.
కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 1 నుంచి రేషన్ షాపుల వద్ద డీలర్ల ద్వారా అవినీతికి తావు లేకుండా సరుకులు పంపిణీ చేస్తున్నట్లు సూళ్లూరుపేట తహసిల్దార్ నరసింహారావు తెలిపారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని ఇందిరా నగర్ షాప్ నెంబర్ 40 లో రేషన్ ఈ-పాస్ మిషన్ పనితీరును తహసిల్దార్ పరిశీలించారు. దగ్గరుండి లబ్ధిదారులకు సరుకులను పంపిణీ చేశారు. అయితే పలుచోట్ల టెక్నికల్ ప్రాబ్లం తో రేషన్ సరుకులు పంపిణీ ప్రక్రియ ఆగింది. సర్వర్ ప్రాబ్లం పరిష్కారం కాగానే సాయంత్రం నుంచి పంపిణీ చేస్తామని డీలర్లు తెలిపారు. ఈ సందర్భంగా తహసిల్దార్ నరసింహారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆకుతోట రమేష్, టిడిపి నేతలు EV.సురేష్, దంతాల రవి తదితరులు పాల్గొన్నారు.