గిరిజనుల భూములకు పట్టాలివ్వండి
మా గిరిజనుడు చుక్కా మురళీపై ఆరోపణలు తగదు -మీడియాతో మాట్లాడిన గిరిజనులు
మా.. హక్కులు మాకు కల్పించండి
గిరిజనుల భూములకు పట్టాలివ్వండి
మా గిరిజనుడు చుక్కా మురళీపై ఆరోపణలు తగదు
మీడియాతో మాట్లాడిన గిరిజనులు
కోవూరు నియోజకవర్గం.. విడవలూరు మండలం ఊటుకూరూ పంచాయతీ ఇందిరానగర్ గిరిజనులు తమ భూముల వద్ద మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఇందిరా నగర్ గిరిజన సాల్ట్ సొసైటీ సభ్యులు, తము సాగుచేస్తున్న భూములకు పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మా గ్రామంలో గిరిజనులు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు లేకపోవడంతో మా జీవనాధారమైనటువంటి భూములకు అక్రమ దారులు ముప్పు కలిగిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం గిరిజనుల భూములపై పట్టాలు ఇవ్వడం ద్వారా తమ హక్కులను పరిరక్షించాలని వారు కోరారు. అక్రమదారులు మేము గిరిజనలం కనుక మాపై దౌర్జన్యాలకు దిగుతున్నారని.. మాలో ముందుకు వచ్చి మాట్లాడే వాళ్ళు లేక.. చదువు రాక.. మా స్థలాలను ఎప్పటినుండో అధికారులకు తెలియజేసినప్పటికీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదని వారు వాపోయారు. మాలో ఒకడైనటువంటి చుక్క మురళి అనే వ్యక్తి చదువుకొని.. మాకు న్యాయం చేయాలని మాట్లాడినందుకు అతని పై లేనిపోని ఆరోపణలు చేయడం తగదన్నారు. మా గిరిజనులకు సాల్ట్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రామంలోని సుమారు 49 గిరిజన కుటుంబాలు ఉన్నాయని, వారికి ప్రభుత్వం గిరిజనుల హక్కులను గుర్తించి, వారి భూములకు పట్టాలు మంజూరు చేయడం ద్వారా మా జీవనోపాధికి తోడ్పడుతుందని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కొమరగిరి నాగమణి,ఎండ్ల సుబ్బమ్మ,చెంబేటి పుట్టమ్మ,కొమరగిరి సుప్రధీక, చుక్క ప్రవళిక, భాను ప్రకాష్, విగ్నేష్, పోలయ్య,తదితరులు పాల్గొన్నారు.