మంత్రి పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి
నెల్లూరు 54వ డివిజన్లో రూ. కోటితో షాజీమంజిల్ నిర్మాణానికి శంకుస్థాపన
మంత్రి రూ.50లక్షలు.. ఎంపీ వేమిరెడ్డి మరో రూ.50లక్షల సొంత నిధులు కేటాయింపు
వేదికపైనే కమిషనర్ నందన్కు చెక్కు అందజేత_
మాట ఇచ్చాం..
నిలబెట్టుకున్నాం..!
మంత్రి పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి
నెల్లూరు 54వ డివిజన్లో రూ. కోటితో షాజీమంజిల్ నిర్మాణానికి శంకుస్థాపన
మంత్రి రూ.50లక్షలు.. ఎంపీ వేమిరెడ్డి మరో రూ.50లక్షల సొంత నిధులు కేటాయింపు
వేదికపైనే కమిషనర్ నందన్కు చెక్కు అందజేత
నెల్లూరు నగరంలోని 54 వ డివిజన్ లో నిర్మించనున్న షాదీ మంజిల్ భవనాన్ని రాబోయే నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. ఆదివారం సాయంత్రం జనార్ధన రెడ్డి కాలనీ లో కోటి రూపాయల పైగా వ్యయంతో నిర్మించనున్న షాదీ మంజిల్ నిర్మాణానికి మంత్రి పొంగూరు నారాయణ, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శంకు స్థాపన చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో.. మంత్రి నారాయణ 50లక్షలు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి మరో 50లక్షలు తమ సొంత నిధులను చెక్ రూపంలో వేదికపైనే నగరపాలక సంస్థ కమిషనర్ నందన్కు అందజేశారు. ఈసందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. పలు విషయాలను వెళ్లడించారు. 53, 54 డివిజన్ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని.. అందుకే అన్ని విధాలా మెరుగైన అభివృద్ధి చేపడుతున్నామన్నారు. డివిజన్లో డ్రైన్లు, తాగునీరు వసతితోపాటు ఇళ్లపట్టాలను అందజేసేందుకు కృషి చేసినట్లు వెళ్లడించారు. వేమిరెడ్డి మాట్లాడుతూ.. మంత్రి నారాయణ నగరాభివృద్ధికి శక్తి వంచనలేకుండా కృషి చేస్తున్నారని.. కొనియాడారు. తనకు తెలిసినంతవరకు 2014 -19 మధ్య 600 నుండి 700 కోట్లు అభివృద్ధి పనులు ఖర్చు పెట్టారని ఆయన అన్నారు. నారాయణ ప్రజల శ్రేయస్సు కోరే మంచి వ్యక్తని.. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే షాదీ మంజల్ పూర్తి కాలేదని.. రాబోయే నాలుగు నెలలలో పూర్తిచేసి ఈ ప్రాంత ప్రజలకు అందజేస్తామని ఈసందర్భంగా వేమిరెడ్డి తెలిపారు. అనంతరం డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ మాట్లాడారు. డిప్యూటీ మేయర్ తహసీన్ స్థానిక కార్పొరేటర్ తహియా బేగం, కోఆప్షన్ మెంబర్ జమీర్, ఇన్చార్జి కలెక్టర్ కే కార్తీక్, మున్సిపల్ కమిషనర్ వై ఓ నందన్ మున్సిపల్ అధికారులు స్థానిక నాయకులు జహీర్, ముజీర్ తదితరులు పాల్గొన్నారు.