గజ్వేల్ మున్సిపల్ ఉద్యోగ జేఏసీ సంఘం నేతలు డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి…
- గజ్వేల్ మున్సిపల్ ఉద్యోగ జేఏసీ సంఘం నేతలు డిమాండ్
రాష్ట్రంలోని 152 మున్సిపాలిటీలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ రాష్ట్ర సెంట్రల్ ఫోరం అధ్యక్షులు ప్రభాకర్ యాదవ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్ గోపాల్ లు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ….ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు ఏర్పాటు కావడంతో గత ప్రభుత్వం మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీంతో సరిపడా సిబ్బందిని కమిషనర్ ఆ స్థాయి దిగువన ఉన్న ఉద్యోగులను నియమించకపోవడంతో ప్రస్తుతం పని చేస్తున్న సిబ్బందిపై పని భారం ఎక్కువైందన్నారు. వెంటనే మున్సిపల్ ఉద్యోగుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ బట్టి రమేష్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నరసయ్య, జిల్లా నాయకులు మధుసూదన్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.