సమయస్ఫూర్తితో వ్యక్తి ప్రాణాలను కాపాడిన వన్టౌన్ సిఐ ఫిరోజ్
కావలి పోలీసుల మానవత్వం
సమయస్ఫూర్తితో వ్యక్తి ప్రాణాలను కాపాడిన వన్టౌన్ సిఐ ఫిరోజ్
తీవ్రమైన ఛాతినొప్పితో పడిపోయిన వ్యక్తిని ప్రాణాపాయం నుండి కావలి పోలీసులు రక్షించారు.
కావలి మండలం ఇందిరమ్మ కాలనీకి చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి ట్రంక్ రోడ్లో లేక్ వ్యూ హోటల్ వద్ద TVS XL బండి పై ఇంటికి వెళ్ళుతూ రోడ్డుపై అకస్మాత్తుగా కుప్పకూలి కింద పడిపోయాడు. గాయాలపాలై అపస్మారక స్థితిలో ఉన్న చంద్రశేఖర్ ను గమనించిన కావలి వన్ టౌన్ సిఐ ఫిరోజ్ స్పందించారు. ప్రాణాపాయం ఉన్న స్థితిని గుర్తించి వెంటనే CPR చేసి డ్రైవర్ శివ, స్థానికుల సహాయంతో వెంటనే కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు సీఐ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉదంతం పోలీసు శాఖ మానవీయత్వాన్ని, సమయస్ఫూర్తిని, ప్రజల పట్ల ఉన్న నిబద్ధతను నిరూపిస్తుందని పలువురు వారి సేవలను కొనియాడారు.