వైసీపీ మోసం చేస్తే.. మేం.. న్యాయం చేశాం..!

టీడీపీపై కోపంతోనే సుజ‌ల సుర‌క్ష మంచినీటి ప‌థ‌కాన్ని ఆపేసింది

సిటీలో 3ల‌క్ష‌ల కుటుంబాల‌కు రూ.2ల‌కే 20 లీట‌ర్ల మంచినీరు

నెల్లూరు న‌గ‌రాన్ని దేశంలోనే మోడ‌ల్ సిటీగా తీర్చిదిద్దుతా

దోమ‌లు లేని న‌గ‌రంగా మారుస్తాం

53, 54 డివిజ‌న్‌ల‌లో ఎన్టీఆర్ సుజ‌ల సుర‌క్ష ప్లాంట్ల‌ను ప్రారంభించిన మంత్రి నారాయ‌ణ‌

వైసీపీ మోసం చేస్తే.. మేం.. న్యాయం చేశాం..!
టీడీపీపై కోపంతోనే సుజ‌ల సుర‌క్ష మంచినీటి ప‌థ‌కాన్ని ఆపేసింది
సిటీలో 3ల‌క్ష‌ల కుటుంబాల‌కు రూ.2ల‌కే 20 లీట‌ర్ల మంచినీరు
నెల్లూరు న‌గ‌రాన్ని దేశంలోనే మోడ‌ల్ సిటీగా తీర్చిదిద్దుతా
దోమ‌లు లేని న‌గ‌రంగా మారుస్తాం

53, 54 డివిజ‌న్‌ల‌లో ఎన్టీఆర్ సుజ‌ల సుర‌క్ష ప్లాంట్ల‌ను ప్రారంభించిన మంత్రి నారాయ‌ణ‌

నెల్లూరు న‌గ‌రం.. వెంక‌టేశ్వ‌ర‌పురంలోని భగత్ సింగ్ కాలనీ, జనార్దన్ రెడ్డి కాలనీ ,అంబేద్కర్ నగర్ ల‌లో శుక్ర‌వారం రాత్రి మంత్రి పొంగూరు నారాయ‌ణ మూడు ఎన్టీఆర్ సుజల సురక్ష మంచినీటి ప్లాంట్ లను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా స్థానిక టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో క‌ల‌సి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. 2 రూపాయిల‌కే 20 లీట‌ర్లు స్వ‌చ్ఛ నీటిని అందించిన మంత్రి.. మంచినీటి దాత‌గా మ‌హిళలు ఆయ‌న్ను కొనియాడారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. పేదలకోసం 2018 లోనే ఎన్టీఆర్ సుజలస్రవంతికి శ్రీకారం చుట్టామ‌ని.. 6 కోట్లతో 6 లక్షల లీటర్ల నీటిని అందించాలనుకున్నామ‌న్నారు. సంగం ప్రాజెక్ట్ నుంచి నీటినితెచ్చే స్పెషల్ డ్రైవ్ చేపెట్టామ‌ని.. మాపై కోపంతో.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప‌థ‌కాన్ని ఆపేసిందంటూ మండిప‌డ్డారు. నాడు వారు అజ్ఞానంగా వ్యవహరించి.. కోట్ల రూపాయల ప్రజా సొమ్మును వృధా చేశార‌న్నారు. సిటీలో 3 లక్షల కుటుంబాలకు
2 రూపాయలకే 20 లీటర్ల మంచినీటిని అందిస్తామ‌ని.. రూరల్ వాసులకు కూడా 2 రూపాయలకే 20 లీటర్ల మంచినీటిని అందించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. నెల్లూరు ని దోమలు లేని నగరం చేయాలన్నదే లక్ష్యమ‌ని.. అలాగే.. అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ ప‌నుల్లో వేగం పెంచామ‌న్నారు. సిటీ లో మిగిలి ఉన్న చిన్న ,పెద్ద డ్రైన్ల పనులన్నీ 300 కోట్లతో ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు. భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇచ్చినమాట నిలబెట్టుకొన్నానని.. ఏళ్ళ తరబడి ఉన్న సమస్యను పరిష్కరించి సీఎం చేతులమీదగా ఇంటి పట్టాలు ఇప్పిస్థాన‌ని ఈసంద‌ర్భంగా నారాయ‌ణ హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం మోసం చేస్తే.. మేము న్యాయం చేసామ‌ని.. పార్కుల అభివృద్ధికి పాటుపడిన వారందరికీ అభినందన తెలిపారు. నెల్లూరు నగరాన్ని అభివృద్ధిలో దేశానికే రోల్ మోడల్ గా నిలబెడతాన‌ని ఆయ‌న అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమీషనర్ నందన్ , ప్రజారోగ్య శాఖ పర్యవేక్షక ఇంజినీరు మోహన్ ,మాజీ జెట్పిటీసి విజేతా రెడ్డి ,టీడీపీ నగరాధ్యక్షులు మామిడాల మధు ,కార్పొరేటర్ షఫియా భేగం ,54 వ డివిజన్ క్లస్టర్ ఇంచార్జ్ జహీర్ ,అధికారులు ,టీడీపీ నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *