ముగిసిన సీపీఎం సమైక్యతా యాత్ర

సీపీఎం రూరల్ కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

ముగిసిన సీపీఎం సమైక్యతా యాత్ర

  • సీపీఎం రూరల్ కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ


సీపీఎం పార్టీ తరపున సమైక్యతా యాత్ర ఘనంగా ముగిసింది. రూరల్ కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు వీఆర్సీ మైదానం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు నాయకులు, కార్యకర్తలు భారీ నిర్వహించారు.


మతసామరస్యం, దేశ సమగ్రత పరిరక్షణకై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న సమైక్యత యాత్ర ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ నెల్లూరు రూరల్ కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని వి ఆర్ సి గ్రౌండ్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ఉగ్రవాదుల చేతిలో అత్యంత దారుణంగా బలిగొన్నారన్నారు. దీనిని సిపిఎం పార్టీగా ఖండిస్తుందన్నారు. ఉగ్రవాదులు దేశంలో మతపరమైన విభజనను తీసుకొని రావాలని, మతవిద్వేషాలు రెచ్చగొట్టాలని పథకం పన్నారన్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా హిందూ ముస్లింల మధ్య వైశ్యామ్యాలు సృష్టించే విధంగా మాట్లాడడం దారుణమన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో అన్ని తరగతుల మత, కుల, వర్గాల ప్రజల మద్దతు తీసుకోవాలని, మతపరమైన విభజనలకు తావు లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించాలని అన్నారు. ర్యాలీలో రూరల్ సీపీఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *