కల్తీ లేని వార్తలు సంచలనం రేపే కథనాలు
కడప మహానాడులో వీపీఆర్ దంపతులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. పార్టీకి రూ. 5 కోట్లు ప్రకటించి అందరిని దృష్టిని ఆకర్షించారు. ఆ తరువాత స్థానంలో మంత్రులు ఆనం, పొంగూరు, ఎంపీ మాగుంటలు నిలిచారు. మహానాడు నిర్వహణలో నెల్లూరు నేతలకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లు ప్రాధాన్యత కల్పించారు.
మాజీ మంత్రి కాకాణి కుమార్తె పూజితను వైసీపీ సిటీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తామంతా వైసీపీ తరపున అండగా ఉంటామని ఆమెకి ధైర్యం కల్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
నెల్లూరు అపోలో హాస్పిటల్ లో ఈనెల 31వతేదీ నుంచి నోటి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని హాస్పిటల్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ తెలియజేశారు. దేశంలో క్యాన్సర్ నిర్మూలనకు అపోలో సంస్థ తన వంతు సామాజిక సేవగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని పేర్కొన్నారు.
శ్రీ సయ్యద్ సుల్తాన్ బీబీ అమ్మవారి 133 వ గంధమహెూత్సం వైభవంగా జరిగింది. తాజ్ మహాల్ ను విద్యుత్ కాంతులతో శోభాయమానంగా అలంకరించారు. పాట కచేరీ, బాణాసంచా వేడుకలు అందరిని అలరించాయి. జిల్లా నలుమూలల నుంచి భక్తులు విశేషంగా తరలి వచ్చి అమ్మవారిని దర్శించి ప్రార్ధనలు నిర్వహించారు.
ప్రాధమిక వ్యవసాయ సహకార సమితి సంఘం ఎన్నో సేవా, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని డిసిఓ గురప్ప తెలియజేశారు. పడుగుపాడు సొసైటీలో ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు…
నాయుడుపేటలో వేర్వేరు ప్రదేశాల్లో రెండు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ప్రమాదాల్లో డ్రైవర్లకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అందరం ఏకమై ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీ శ్రీనివాసులు అన్నారు. జక్కా వెంకయ్య వర్ధంతి సందర్భంగా పహల్గాం ఉగ్రవాది దాడుల పరిణామాలపై జరిగిన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు.
మహానాడులో టీడీపీ డాక్టర్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జెడ్ శివ ప్రసాద్ నేతృత్వంలో వైద్య సేవలు అందించారు. వేలాది మందికి వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు అందచేశారు. ఈ మూడు రోజుల వైద్య బృందానికి జెడ్ ఎస్సే నేతృత్వం వహించారు.
ఓ మహిళ అనమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన పొదలకూరులో చోటు చేసుకుంది. ఆమె రక్తపు మడుగులో పడి ఉండడంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
అల్లూరు మండల పరిధిలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా ఐదు చోట్ల చోరీలు జరగటంతో పోలీసులకు సవాల్ గా మారింది. దొంగతనాలను పోలీసులు అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.