ఈనెల 31 నుంచి పరీక్షలు
మీడియా సమావేశంలో వెల్లడించిన
అపోలో మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీరామ్ సతీష్
నెల్లూరు అపోలోలో నోటి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు
- ఈనెల 31 నుంచి పరీక్షలు
- మీడియా సమావేశంలో వెల్లడించిన అపోలో మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీరామ్ సతీష్
నెల్లూరు అపోలో హాస్పిటల్ లో ఈనెల 31వతేదీ నుంచి నోటి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని హాస్పిటల్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ తెలియజేశారు. దేశంలో క్యాన్సర్ నిర్మూలనకు అపోలో సంస్థ తన వంతు సామాజిక సేవగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని పేర్కొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక శాతం నోటి క్యాన్సర్ బారిన పడే దేశాల జాబితాలో భారతదేశం కూడా ఉండటం ఆందోళన కలిగిస్తుందని, ఏడాదికి 52వేల మంది భారత్ లో నోటి క్యాన్సర్ మూలంగా మరణిస్తున్నారని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ వెల్లడించారు. దేశంలో క్యాన్సర్ నిర్మూలనకు అపోలో సంస్థ తన వంతు సామాజిక సేవగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఈనెల 31వ తేదీనా ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం డాక్టర్ శ్రీరామ్ సతీష్ నెల్లూరు అపోలో హాస్పిటల్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ENT వైద్య నిపుణులు డాక్టర్ సతీష్, డాక్టర్ నాగేంద్ర, సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ జి.వి.వి. ప్రసాద్, సీనియర్ అంకాలజిస్ట్ డాక్టర్ హరితతో కలిసి మీడియాతో మాట్లాడారు. పొగాకు వ్యసనానికి బానిసలుగా మారిన వ్యక్తులను గుర్తించి వారిని ఆ అలవాటుకు దూరంగా మార్చేందుకు అపోలో సంస్థ… ఈషా ఫౌండేషన్ తో కలిసి పనిచేస్తుందని తెలిపారు. సమావేశంలో డాక్టర్ సతీష్, డాక్టర్ నాగేంద్ర, డాక్టర్ జి.వి.వి. ప్రసాద్, డాక్టర్ హరిత హాస్పిటల్ యూనిట్ హెడ్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.