ఆలయ ఈవోకి అందచేసిన కడప వాసులు
పెంచలకోన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు, నిత్య కళ్యాణం
నిత్య అన్నదానికి రూ. 1 లక్ష విరాళం…
- ఆలయ ఈవోకి అందచేసిన కడప వాసులు
- పెంచలకోన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు, నిత్య కళ్యాణం
రాపూరులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి శుక్రవారం విశేష పూజలు, అభిషేకాలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. కడప జిల్లా బద్వేల్ కి చెందిన లక్ష్మీ విద్య అరణ్య స్కూల్ యాజమాన్యం గాజులపల్లి శంకర్ రెడ్డి, శ్రీదేవి దంపతులు నిత్య అన్నదానికి రూ. 1 లక్ష విరాళాన్ని ఆలయ ఈవోకి అందజేశారు.
నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి శుక్రవారం విశేష పూజలు, అభిషేకాలు కన్నుల పండువగా నిర్వహించారు. భక్తులు విశేషంగా తరలి వచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కడప జిల్లా బద్వేల్ కి చెందిన లక్ష్మీ విద్య అరణ్య స్కూల్ యాజమాన్యం గాజులపల్లి శంకర్ రెడ్డి, శ్రీదేవి దంపతులు ఆలయంలో నిత్య అన్నదానికి రూ. 1 లక్ష విరాళాన్ని ఆలయ ఈవో పోరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కు అందజేశారు. వారికి ఆలయ నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు. శంకర్ రెడ్డి దంపతులు స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.