ఉపశమనం పొందిన ప్రజలు
దుత్తలూరులో జోరు వర్షం…
- ఉపశమనం పొందిన ప్రజలు
నెల్లూరు జిల్లా దుత్తలూరులో మండలంలో జోరు వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా వేసవి ఉక్కపోతతో ప్రజలు, చిన్నారులు అల్లాడిపోతున్నారు. ఈ వర్షంతో మండల ప్రజలందరూ కాస్త ఉపశమనం పొందారు. ఈదురు గాలులతో కూడిన వర్షం పడడంతో వాతావరణమంతా ఒక్కసారిగా చల్లగా మారింది.