రూ. 15 కోట్లతో సిద్ధమవుతున్న సరస్వతీ నిలయం
వీఆర్ హైస్కూల్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ
తల రాతలు మారబోతున్నాయి
- రూ. 15 కోట్లతో సిద్ధమవుతున్న సరస్వతీ నిలయం
- వీఆర్ హైస్కూల్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ
వీఆర్ హైస్కూల్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. ప్రతి తరగతి గదికి వెళ్లి జరుగుతున్న అభివృద్ధి పనులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. భారతదేశంలోనే నంబర్ వన్ స్కూల్ గా తీర్చిదిద్దబోతున్నామని చెప్పారు.
నగర నడిబొడ్డులో ఉన్న విఆర్సీలో చదివిన చాలా మంది ఉన్నతస్థాయిలో ఉన్నారని మంత్రి నారాయణ తెలిపారు. నగరంలోని వీఆర్ హైస్కూల్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను ఆయన ఇన్చార్జి కలెక్టర్ కార్తీక్, కమిషనర్ వైవో నందన్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ లతో కలసి పరిశీలించారు. హై స్కూల్ లోని ప్రతి తరగతి గదికి వెళ్లి జరుగుతున్న అభివృద్ధి పనులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా క్రీడా మైదానాన్ని కూడా ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ….15 కోట్ల రూపాయల వ్యయంతో పేద విధ్యార్థుల కోసం సరస్వతీ నిలయం సిద్దం అవుతుందన్నారు. ఎన్సీసీ కంపెనీ నాణ్యతా ప్రమాణాలతో పనులు చేస్తుందన్నారు. భారతదేశంలోనే నంబర్ వన్ స్కూల్ గా తీర్చిదిద్దబోతున్నామని, వెయ్యి మంది నిరుపేద విద్యార్థులకు అడ్మిషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఇన్చార్జి కలెక్టర్, కమిషనర్, డిప్యూటీ మేయర్లు మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విదంగా వీఆర్ స్కూల్ ను అభివృద్ధి చేస్తున్నారన్నారు. వీఆర్ హైస్కూల్ ప్రారంభంతో వేల మంది పేద విద్యార్ధుల తల రాతలు మారబోతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.