జూన్ 4న వెన్నుపోటుు దినం

విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రాపూరు వైసీపీ నేతలు

జూన్ 4న వెన్నుపోటుు దినం

  • విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రాపూరు వైసీపీ నేతలు

ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయినా… ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడంలో విఫలమైందని రాపూరు మండల వైసీపీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు వారు పట్టణంలోని పిచ్చిరెడ్డి కాంప్లెక్స్ లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కూటమి పాలనకి వ్యతిరేకంగా జూన్ 4న వెన్నుపోటు దినంగా జరపాలని వైసీపీ అధిష్ఠానం నిర్ణయించిందన్నారు. ఈ కార్యక్రమానికి మండలంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు బొడ్డు మధుసూదన్ రెడ్డి, బత్తిన పట్టాభిరామిరెడ్డి, జిల్లా ఆర్గనైజ్ సెక్రెటరీ దందోలు లక్ష్మీనారాయణ రెడ్డి, ఏటూరు మురళీమోహన్రెడ్డి, డాక్టర్ ఖాదర్ బాషా, పిచ్చిరెడ్డి, అవినాష్ రెడ్డి, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *