పాల్గొన్న ఎమ్మెల్సీలు, రూరల్ వైసీపీ ఇన్చార్జి
కాకాణితో సజ్జల ములాఖత్
- పాల్గొన్న ఎమ్మెల్సీలు, రూరల్ వైసీపీ ఇన్చార్జి
అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి రిమాండ్ లో ఉన్న విషయం విధితమే. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ పీఏసీ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి నెల్లూరుకి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ వైసీపీ సమన్వయకర్త ఆనం విజయకుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ రెడ్డి, పలువురు వైసీపీ ముఖ్య నేతలతో కలసి నెల్లూరు జైల్లో ఉన్న కాకాణితో ములాఖత్ అయ్యారు. వారి వెంట వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు.