సంగం ఎంపీడీవో షాలెట్
ఒక్క ముందే పెన్షన్లు పంపిణీ
సంగం ఎంపీడీవో షాలెట్
ఒక రోజు ముందే లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని ఎంపీడీవో షాలెట్ తెలిపారు. సంగంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
నెల్లూరు జిల్లా సంగం మండలంలోని పింఛన్ లబ్ధిదారులకు ఒకరోజు ముందుగా శనివారమే నగదు పంపిణీ చేస్తామని ఎంపీడీవో షాలెట్ తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మండలంలోని 13 సచివాలయాల పరిధిలో 6,547 మంది లబ్ధిదారులకు 2 కోట్ల 82 లక్షల 92 వేల 500 రూపాయలు పంపిణీ చేస్తామన్నారు.అదేవిధంగా స్పౌస్ కింద కొత్తగా మరో 77 పింఛన్లు మంజూరయ్యాయని..దానికి 3 లక్షల 8 వేల రూపాయలు పంపిణీ చేస్తామని తెలిపారు.సచివాలయ సిబ్బంది 31వ తేదీ ఉదయం 7 గంటల నుంచి నగదు పంపిణీ ప్రారంభిస్తారని చెప్పారు. లబ్ధిదారులు ఇళ్ల వద్ద అందుబాటులో ఉండాలని కోరారు.రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి 31 వ తేది ఉదయం సంగం మండలం వీర్ల గుడిపాడు గ్రామంలో పింఛన్ల పంపిణీ చేస్తారని తెలిపారు.