మూడో రోజు కొనసాగుతున్న కడప మహానాడు
భారీగా తరలి వచ్చిన పసుపు సైన్యం
మహా సంబరం…
- మూడో రోజు కొనసాగుతున్న కడప మహానాడు
- భారీగా తరలి వచ్చిన పసుపు సైన్యం
కడపలో మూడో రోజు జరుగుతున్న మహానాడు బహిరంగ సభకు రెండు తెలుగు రాష్ట్రాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వెళ్లారు. దీంతో మహానాడు ప్రాంగణం పసుపుమయంగా మారిపోయింది.
కడప శివారు చెర్లోపల్లిలో మూడో రోజు మహానాడు సంబరంగా జరిగింది. మహానాడుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు తరలి వచ్చారు. దీంతో మహానాడు ప్రాంగణం పసుపుమయంగా మారిపోయింది. జై తెలుగుదేశం…జై ఎన్టీఆర్…జై చంద్రబాబు అన్న నినాదాలతో ప్రాంణగం మారుమోగిపోయింది. మూడు రోజులుగా జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో పార్టీ శ్రేణులకి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కమిటీ సభ్యులు అన్నీ ఏర్పాట్లు చేశారు. మహాసభలో భవిష్యత్ లక్ష్యాలపై సీఎం చంద్రబాబు ప్రసంగించారు. నాయకులు, కార్యకర్తలకి ఆయన పలు సూచనలు చేశారు. పార్టీ బలోపేతం కోసం ప్రతీ ఒక్కరూ కష్టపడి పని చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు పిలుపునిచ్చారు.