ఏడు సవర్ల బంగారం, లక్ష నగదు దోచుకెళ్లిన దుండగులు
పోలీసులకి ఫిర్యాదు చేసిన బాధితులు – అల్లూరులో ఘటన
జాతరకి వెళ్లి వచ్చేలోపే దోచేశారు..
ఏడు సవర్ల బంగారం, లక్ష నగదు దోచుకెళ్లిన దుండగులు
పోలీసులకి ఫిర్యాదు చేసిన బాధితులు
అల్లూరులో ఘటన
నెల్లూరు జిల్లా అల్లూరు దళితవాడకు చెందిన ఈపూరు బ్రహ్మయ్య కుటుంబ సభ్యులు తన అత్తగారు ఊరైన తరుణవాయి గ్రామంలో జరిగే జాతరకు వెళ్లొచ్చే లోపు దుండగులు ఇల్లును గుల్ల చేశారు. బాధితులు కథనం మేరకు… అల్లూరు హరిజనవాడకు చెందిన ఈపూరు బ్రహ్మయ్య ఈనెల 27వ తేదీన మంగళవారం తన అత్తగారు ఊరైన సంగం మండలం తరుణవాయి గ్రామంలో జరిగే పోలేరమ్మ జాతరకు కుటుంబ సభ్యులందరూ కలిసి వెళ్లారు. తిరిగి గురువారం వచ్చి చూసేసరికి ఇంటి తలుపులు పగలగొట్టి ఉండటంతో బ్రహ్మయ్య ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తలుపులను పగలగొట్టి అందులోని వస్తువు చేసి పడేసి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. ఈ ఘటనలు దాదాపు ఏడు సవర్ల బంగారు నగలు, లక్ష రూపాయలు నగదు దండగులు అపహరించుకుపోయినట్లు బాధితులు తెలిపారు. గత వారం వ్యవధిలోని అల్లూరు మండల కేంద్రంలో ఐదు చోట్ల చోరీలు జరగటం పోలీసులకు సవాల్ గా మారింది. ఇప్పటికైనా పోలీసులు గస్తీ ఏర్పాటు చేయాలని చోరీలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.