ముత్తుకూరు గేటు సెంటర్లో కామ్రేడ్ జక్కా వెంకయ్య వర్ధంతి
వెంకయ్య చిత్రపటానికి నివాళులర్పించిన నాయకులు
జక్కా వెంకయ్య ఆశయా సాధనకు కృషి చేద్దాం
- ముత్తుకూరు గేటు సెంటర్లో కామ్రేడ్ జక్కా వెంకయ్య వర్ధంతి
- వెంకయ్య చిత్రపటానికి నివాళులర్పించిన నాయకులు
పోరాట యోధుడు, కామ్రేడు జక్కా వెంకయ్య ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని సీపీఎం నేతలు పిలుపునిచ్చారు. నెల్లూరు నగరం 16వ డివిజన్ సీపీఎం పార్టీ టౌన్ సెక్రటరీ కాయం శ్రీనివాసులు ఆధ్వర్యంలో ముత్తుకూరు గేటు సెంటర్లో జక్కా వెంకయ్య 7వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్య చిత్రపటానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నేతలు మాట్లాడుతూ….కామ్రేడ్ జక్కా వెంకయ్య అందించిన ఆశయ స్ఫూర్తితో నెల్లూరు జిల్లాలో ప్రజా ఉద్యమాలు, పోరాటాలు ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నాయకులు మూలం రమేష్, మహిళ జిల్లా కార్యదర్శి మస్తాన్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నరసింహ, మహిళా శాఖ కార్యదర్శి సంపూర్ణమ్మ, శాఖ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.