ప్రతి తరగతి గదిలో డిజిటల్ స్క్రీన్స్ ఏర్పాటు
విఆర్ హైస్కూల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి కుమార్తె పొంగూరు షరణి
వీఆర్ హైస్కూల్లో హైడ్రో ఫోనిక్ టెక్నాలజీ
- జూన్ 12న స్కూల్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం
- నెల్లూరు వీఆర్సీ స్కూల్ లో జరుగుతున్న పనులను పర్యవేక్షించిన రాష్ట్ర మంత్రి కుమార్తె పొంగూరు షరణి
యాంకర్ పార్ట్ :
నెల్లూరు వీఆర్సీ హైస్కూల్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు షరణి పరిశీలించారు. ప్లే గ్రౌండ్, డైనింగ్ హల్ ఏర్పాట్లను పరిశీలించిన ఆమె పలు సూచనలు సలహాలు ఇచ్చారు.
వాయిస్ వోవర్ :
జూన్ 12 న వీఆర్ హైస్కూల్ పునః ప్రారంభించాలని మా నాన్న నారాయణగారు సంకల్పించారని మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు షరణి తెలిపారు. నెల్లూరు విఆర్సీ హైస్కూల్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను ఆమె పరిశీలించారు. ప్లే గ్రౌండ్, డైనింగ్ హల్ ఏర్పాట్లను పరిశీలించిన ఆమె పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా పొంగూరు షరణి మీడియాతో మాట్లాడుతూ ఎంతోమంది పేద విద్యార్థులకు ఉపయుక్తమైన స్కూల్ నిర్మాణ బాధ్యతను మా నాన్న గారు తనకు అప్పగించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నాణ్యత ప్రమాణాలతో విఆర్సీ స్కూల్ ని తీర్చిదిద్దేందుకు గడిచిన నాలుగు రోజులుగా నెల్లూరులోనే ఉంటూ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నానని తెలియజేశారు. విద్యార్థులకు అన్నిరకాల ల్యాబ్ లు , డాన్స్, మ్యూజిక్ , డ్రాయింగ్ రూం లు కూడా ఏర్పాటు చేస్తున్నామని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.