సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీ శ్రీనివాసులు
జక్కా వెంకయ్య వర్ధంతి సందర్భంగా ఉగ్రవాది పరిణామాలపై సదస్సు
అందరం ఏకమై ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలి..
- సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీ శ్రీనివాసులు
- జక్కా వెంకయ్య వర్ధంతి సందర్భంగా ఉగ్రవాది పరిణామాలపై సదస్సు
నెల్లూరు జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ జక్కా వెంకయ్య 7వ వర్ధంతి సందర్భంగా… నగరంలోని అపోలో హాస్పిటల్ వద్దనున్న డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో పహల్గాం ఉగ్రదాడి తదంతర పరిణామాలు అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసులు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన జక్కా వెంకయ్య నెల్లూరు జిల్లాలో అనేక భూ పోరాటాలు కూలిపోరాటాలు నిర్వహించారన్నారు. నగరంలో ఇళ్ల స్థలాల పోరాటం నిర్వహించి పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది అన్నారు. పహల్గాం ఉగ్రవాది దాడిలో దాదాపు 26 మంది మరణించారని.. ఇంతవరకు మోడీ ప్రభుత్వం వారిని పరామర్శించలేదని విమర్శించారు. అయితే ఉగ్రవాదాన్ని దేశవ్యాప్తంగా అందరూ ఐక్యమై ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ అధ్యక్షతన జరిగిన సదస్సులో మాదాల వెంకటేశ్వర్లు, కే అజయ్ కుమార్, గోగుల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.