కడపలో రాష్ట్ర మహానాడు కార్యక్రమం రెండో రోజు కొనసాగుతోంది -టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి సీఎం చంద్రబాబునాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కడపలో రాష్ట్ర మహానాడు కార్యక్రమం రెండో రోజు అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి సీఎం చంద్రబాబునాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రెండో రోజు కూడా టీడీపీ శ్రేణులు పోటెత్తారు.
వైఎస్సార్ కడప జిల్లాలో నిన్న ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ మహానాడు ఉత్సాహంగా సాగుతోంది. ఈ సందర్భంగా టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి సీఎం చంద్రబాబు, ఎంపీ, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జై ఎన్టీఆర్…జై జై ఎన్టీఆర్ అభిమానుల నినాదాలతో ప్రాంగణం మారుమోగిపోయింది. రాష్ట్రం నలుమూలల నుంచి పోటెత్తిన టీడీపీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ అభిమానులతో మహానాడు ప్రాంగణం పసుపుమయమైంది. రేపటి వరకు కొనసాగనున్న మహానాడులో నేడు రెండో రోజు అజెండాను ప్రకటించారు. అనంతరం సీఎం చంద్రబాబునాయుడు ప్రసంగించారు.