జూన్ 1న యాదవ విద్యార్థులకి ప్రతిభా, నగదు పురస్కారాలు
మీడియా సమావేశంలో యాదవ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్ రాష్ట్ర అధ్యక్షులు గుర్రం
ఆత్మకూరు పట్టణంలో యాదవ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్ రాష్ట్ర అధ్యక్షులు గుర్రం నాగేశ్వరరావు యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. తమ సంఘం ఆధ్వర్యంలో 2025 సంవత్సరంలో పదవ తరగతి పరీక్షలు రాసి 470 పైగా మార్కులు సాధించిన యాదవ విద్యార్థులకు ప్రతిభా పురస్కార నగదు బహుమతినీ జూన్ 1వ తేదీన నెల్లూరులోని కొండయ్య పాలెం గేటు వద్ద ఉన్న యాదవ భవనంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులకు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గృహనిర్మాణ సమాచార శాఖ మంత్రివర్యులు పార్థసారథి మరియు సంఘ పెద్దలందరూ పాల్గొంటారని తెలిపారు.. ఈ నగదు బహుమతి అందుకునేందుకు పదో తరగతి పరీక్షలలో 470కు పైగా మార్కులు సాధించిన ఉమ్మడి జిల్లాలకు చెందిన యాదవ విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. తమ పేర్లను నమోదు చేసుకోవడానికి పీలం సురేష్ బాబు 9705800794 నంబర్ కు గాని లేదా కటారి సుధాకర్ 9573105305 నెంబర్కు గాని ఫోన్ చేసి తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.ఈ సమావేశంలో వీరితోపాటు సంఘం సభ్యులు కటారి సుధాకర్ యాదవ్, గాలిపోయిన అయ్యన్న యాదవ్, దేవరాల వెంకటరమణ యాదవ్, మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.