బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కరణం
11వ డివిజన్లో ఆహిల్యా బాయి హోల్కర్ 300 జయంతోత్సవాలు
దేవి ఆహిల్యా బాయి హోల్కర్ 300వ జయంతోత్సవాలను బీజేపీ నేతలు ఘనంగా నిర్వహించారు. మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కరణం సుభాషిణి హోల్కర్ జీవిత చరిత్ర గురించి ప్రజలకు తెలియజేశారు.
నెల్లూరు నగరం 11వ డివిజన్ ఎన్టీఆర్ రాయపుపాళెంలో…దేవి ఆహిల్యా బాయి హోల్కర్ 300వ జయంతోత్సవాలను బీజేపీ నేతలు ఘనంగా నిర్వహించారు. బాలాజీనగర్ మండల బీజేపీ అధ్యక్షులు మింగా కిరణ్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కరణం సుభాషినిల ఆధ్వర్యర్యంలో…హోల్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు దేవీ ఆహిల్యా బాయి హోల్కర్ గురించి స్థానిక మహిళలకు తెలియజేశారు. అనంతరం వారు ఎన్3 న్యూస్తో మాట్లాడారు. పుణ్యశీల అహిల్యా బాయి హోల్కర్ అని తెలిపారు. భారతదేశ మహిళలందరూ హోల్కర్ జీవిత చరిత్ర తెలుసుకోవాలన్న మంచి ఉద్దేశంతోనే ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమంలో మహిళ మోర్చా జిల్లా కార్యదర్శి నాగలక్ష్మి, మూలాపేట మండల అధ్యక్షరాలు CH పద్మ, దామవరపు అనూష పాల్గొన్నారు.