న్యూ సమైక్య మ్యారేజ్ మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మయ సమావేశం
నెల్లూరు జిల్లా మ్యారేజ్ మీడియేటర్స్ ఆత్మీయ సమావేశం ఆంధ్రప్రదేశ్ న్యూ సమైక్య మ్యారేజ్ మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గున్నం శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండు ప్రాంతంలోని బాబు జగ్జీవన్రామ్ భవన్లో జరిగింది. ఈసందర్భంగా పలు ముఖ్యమైన అంశాలపై చర్చించారు. అనంతరం ముఖ్య అతిథి, ఆ సంఘ ప్రధాన కార్యదర్శి పట్టాభి రామయ్య మాట్లాడారు. ఈ అసోసియేషన్ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో ఎంతో మంచి పేరు సంపాదించుకుందని.. నెల్లూరు జిల్లాలోనూ మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ సభ్యులు సాయి ప్రసాద్, నారాయణ, తమ్మిరెడ్డి, వెంకటాద్రి, సరళ, డాక్టర్ హరినారాయణ తదితరులు పాల్గొన్నారు.