సర్వేపల్లి సమగ్రాభివృద్దే లక్ష్యం

ఏడాదిలో రూ. 111.52కోట్లతో 685 అభివృద్ధి పనులు

పొదలకూరు కుట్టు మిషన్ శిక్షణ ప్రారంభోత్సవంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి వెల్లడి

సర్వేపల్లి సమగ్రాభివృద్దే లక్ష్యం..

  • ఏడాదిలో రూ. 111.52కోట్లతో 685 అభివృద్ధి పనులు
  • పొదలకూరు కుట్టు మిషన్ శిక్షణ ప్రారంభోత్సవంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి వెల్లడి


పొదలకూరులోని సచివాలయంలో కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. సర్వేపల్లి నియోజకవర్గం లో మొత్తం 583 మందికి శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్ లు ఉచితంగా ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు.


సర్వేపల్లి సమగ్రాభివృద్దే లక్ష్యంగా తాను పనిచేస్తున్నట్లు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు సచివాలయం మూడులో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడుతూ… ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే సర్వేపల్లి నియోజకవర్గంలో రూ.111.52 కోట్లతో 685 అభివృద్ధి పనులు చేసినట్లు వివరించారు. గత పాలనలో మూతపడ్డ కార్పొరేషన్లు ఇప్పుడు తిరిగి పనిచేయడం ప్రారంభమయ్యాయని అందులో భాగంగా ఒక పొదలకూరు మండలంలోని 120 మందికి కుట్టు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. సర్వేపల్లి నియోజకవర్గం లో మొత్తం 583 మందికి శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్ లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నరసింహారావు, తహసిల్దార్ శివకృష్ణయ్య, మండల టిడిపి అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు, పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున్ నాయుడు, ఏఎంసీ వైస్ చైర్మన్ వెంపులూరి అరుణ, తెలుగు యువత మండల అధ్యక్షుడు వెన్నపూస రాజశేఖర్ రెడ్డి, రైతు నాయకులు కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *