అధికారుల్ని ఆదేశించిన కమిషనర్ వైవో నందన్
నెల్లూరు కార్పొరేషన్ గ్రీవెన్స్ లో అర్జీలు స్వీకరించిన కమిషనర్
శాశ్వత పరిష్కారం అందించాలి…
- అధికారుల్ని ఆదేశించిన కమిషనర్ వైవో నందన్
- నెల్లూరు కార్పొరేషన్ గ్రీవెన్స్ లో అర్జీలు స్వీకరించిన కమిషనర్
నెల్లూరు కార్పొరేషన్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ వైవో నందన్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతీ అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 66 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ వైవో నందన్ తెలిపారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ లో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. విభాగాల వారీగా ఇంజనీరింగ్ – 6, హౌసింగ్ 27, టౌన్ ప్లానింగ్ 12, రెవెన్యూ 10, పబ్లిక్ హెల్త్ 3, apcos 4, అకౌంట్ సెక్షన్ 4 మొత్తం 66 ఫిర్యాదులను అందుకున్నామని కమిషనర్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ అంశాలపై ప్రజల నుంచి వచ్చిన అర్జీలన్నింటికి నిర్ణీత సమయంలోగా పరిష్కారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.